ఆంధ్రప్రదేశ్: ఏపీలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 23కు చేరింది.
తెలంగాణ:
కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 77కు చేరింది.
నేటి నుంచి జూనియర్ డాక్టర్ల విధుల బహిష్కరణ: కరోనా ప్రొటెక్షన్ కిట్లు ఇవ్వడం లేదని నిరసన చేయనున్నట్లు ప్రకటించారు.
నేటి నుంచి సీసీఎంబీలో కరోనా పరీక్షలు నిర్వహించనున్నారు. సీసీఎంబీలో కరోనా పరీక్షలకు కేంద్రం అనుమతి ఇచ్చింది.
జాతీయం:
దేశంలో ఇప్పటివరకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1347 మందికి చేరింది. కరోనా మరణాల సంఖ్య 43కు చేరింది. ఇప్పటివరకు కోలుకొని137 మంది డిశ్చార్జ్ అయ్యారు.
అంతర్జాతీయం:
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ కేసుల సంఖ్య 7.84 లక్షలు దాటింది. కరోనా వైరస్ మరణాల సంఖ్య 37,778కి చేరింది.
ప్రపంచవ్యాప్తంగా 1,65,035 మంది కోలుకున్నారు.
అమెరికాలో కరోనా బాధితుల సంఖ్య 1,63,287కు చేరింది.
అమెరికాలో కరోనా మరణాల సంఖ్య 3 వేలు దాటింది.