పదో తరగతి విద్యార్థులకు రేడియో పాఠాలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పదో తరగతి విద్యార్థులకు బుధవారం(ఈ నెల 22) నుంచి మే 15 వరకు రేడియో మాధ్యమం ద్వారా పాఠాలు బోధించనున్నట్లు సమగ్ర శిక్ష రాష్ట్ర సంచాలకులు, పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ వాడ్రేవు చినవీరభద్రుడు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇప్పటికే దూరదర్శన్‌ సప్తగిరి చానెల్‌ ద్వారా ‘విద్యామృతం’ పేరిట పాఠాలు బోధిస్తున్నారు. అయితే, రేడియోలో కూడా రోజూ ఉదయం 11.05 నుంచి 11.35 నిమిషాల వరకు (అరగంట) పదో తరగతి పాఠాల బోధన, పరీక్షల సన్నద్ధతపై కార్యక్రమాలు ప్రసారం చేయనున్నారు.