తెలంగాణ ఎన్నికల ఫలితాల ప్రభావం తెలుగుదేశం పార్టీని ఇప్పుడిప్పుడే వదిలేలా లేదు. ముప్పయి ఏళ్ల విరోధాన్ని వదిలి కాంగ్రెస్తో కలిసి పనిచేయడం అంత తేలికైన విషయం కాదని కింది స్థాయిలో తమ్ముళ్లకు బాగానే అర్థమవుతున్నట్లు ఉంది. అందుకే ఏపీలో కాంగ్రెస్తో పొత్తుపై తెలుగుదేశం నాయకత్వంపై కింది స్థాయి కేడర్ నుంచి తీవ్రంగా ఒత్తిడి వస్తున్నట్టు సమాచారం.
రాష్ట్రమును ముక్కలు చేసిన కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుంటే వైసీపీ, జనసేనలకు ఎన్నికల్లో ఆయుధం ఇచ్చినట్టే అని ఎక్కుమంది తెలుగుదేశం నాయకులు అభిప్రాయపడుతున్నారు.

అయితే నాయకులు చెప్పే మాటల కంటే సొంత సర్వేల మీదనే ఎక్కువగా ఆధారపడే చంద్రబాబు నాయుడు ఎలాంటి నిర్ణయం తీసుకోనున్నారనేది వేచి చూడాలి. ఏపీలో కాంగ్రెస్తో పొత్తుకు సంబంధించి కాంగ్రెస్ వైపు నుంచి కూడా అంతగా ఒత్తిడి ఏమీ లేదు. తెలంగాణలో కలిసిన సందర్భంలో రాహుల్ గాంధీ కూడా ఇదే విషయం నాయుడుగారికి చెప్పారు. మీకు ఏపీలో ఎలా లాభం వస్తుందనుకుంటే అలాగే చేద్దామని రాహుల్ గాంధీ చెప్పినట్టు వార్తలు వచ్చాయి.
అయితే వైసీపీ, జనసేనలను తట్టుకోవాలంటే ఏదో ఒక పార్టీతో పొత్తు ఉండాలనే అభిప్రాయం చంద్రబాబుకు ఉన్నట్టుంది. ఒకవేళ ఎన్నికల నాటికి బీజేపీ, వైసీపీ, జనసేనల మద్య లోపాయికారీ ఒప్పందం కుదిరితే ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయేమోనన్న ఆందోళన చంద్రబాబు ఉండొచ్చు.
దీనికితోడు కేసీఆర్ కూడా ఏపీ రాజకీయాల్లో వేలుపెడతాననడం, అసదుద్దీన్ ఒవైసీ బహిరంగంగానే జగన్కు మద్దతు ప్రకటించిండం వంటివి చంద్రబాబును కొంచెం ఆలోచనలో పడేసే అంశాలు. అయితే దీనికి పరిష్కారం కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోవడమేనా అంటే… జనం నాడి ఎలా ఉందనే దాన్నిబట్టే ఉంటుంది. ఏదైనా జరగొచ్చు.