తెలుగుదేశం పార్టీకి 38 ఏళ్లు

అమరావతి – హలో ఏపీ న్యూస్ ప్రతినిధి:

నందమూరి తారక రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీకి 38 ఏళ్లు.

తెలుగుదేశం పార్టీ నేటితో 37 ఏళ్లు పూర్తిచేసుకొని 38వ వసంతంలోకి అడుగుపెట్టింది. కరోనా కట్టడిలో భాగంగా లాక్‌డౌన్‌ ప్రకటించినందున ఈసారి నేతలంతా ఇళ్లలోనే పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరుపుకోనున్నారు. ఇళ్లపై తెలుగుదేశం జెండాలు ఎగరేసి ఎన్టీఆర్ చిత్రపటాల వద్ద నివాళులు అర్పించాలని అధినేత చంద్రబాబు సూచించారు.

ఎన్నో ఆటుపోటులను ఎదుర్కొని తెలుగుదేశం ఎన్టీ ఆర్ మరణానంతరం కూాడా అధికారాన్ని చేపట్టింది. చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఆ పార్టీ నిలదొక్కుకోగలిగింది. అయితే చంద్రబాబు తర్వాత పార్టీ నాయకత్వంపై కొంత ఆందోళన ఉంది.